- Advertisement -
ఒక ఫైల్ను పేపర్లా చూడొద్దు.. అది ఒక మనిషి జీవితంగా భావించాలని గవర్నర్ నరసింహన్ హితవు పలికారు. నేడు ఆయన ఎంసీఆర్హెచ్ఆర్డీలో గ్రూప్-1ట్రైనీల వీడ్కోలు సభకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మీరూ పౌరులని భావిస్తేనే వాళ్ల కష్టాలు తెలుస్తాయన్నారు. ప్రతి యేటా మొక్కలు నాటడం కాదని.. అవి బతికేలా చర్యలు తీసుకోవాలన్నారు. భారతీయులుగా ఉన్నందుకు గర్వపడండని.. నిజాయితీగా పని చేయాలని గవర్నర్ నరసింహన్ స్పష్టం చేశారు.
- Advertisement -