యుఎస్‌లో కాల్పులు..నల్గొండ వాసి మృతి

235
us firing
- Advertisement -

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఓ స్టోర్‌లో ప్రవేశించిన దుండగులు జరిగిన కాల్పుల్లో యాదాద్రి జిల్లా ఆత్మకూర్‌ మండలం రహింఖాన్‌పేట గ్రామానికి చెందిన గోవర్దన్‌రెడ్డి మృతిచెందారు. ఏడేళ్ల క్రితం అమెరికా వెళ్లిన గోవర్ధన్‌ దుండగులు చోరబడి కాల్పులు జరిపిన స్టోర్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.

19వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. స్టోర్‌లో దొంగతనానికి వచ్చిన దుండగులు కాల్పులకు తెగబడ్డట్లు తెలుస్తోంది.

హైదరాబాద్‌ ఉప్పల్‌లోని స్వరూప్‌నగర్‌లో ఉంటున్న గోవర్ధన్ కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. మృతునికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.ఇంకో రెండు నెలల్లో ఇండియాకు తిరిగి వస్తానని చెప్పిన గోవర్థన్ అనంతలోకాలకు వెళ్లడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

- Advertisement -