పేదల అభ్యున్నతికి మరో ముందడుగు:ఉప్పల శ్రీనివాస్‌

187
uppala srinivas
- Advertisement -

పేద ప్రజల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరో అడుగు ముందుకు వేశారని తెలిపారు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న 50 శాతం రిజర్వేషన్లను కొనసాగిస్తూ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఇ. డబ్ల్యు. ఎస్.) మరో పదిశాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు నిర్ణయించడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎల్లప్పుడూ తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం తపిస్తూ అహర్నిశలు కృషి చేస్తున్న కేసీఆర్ గారికి, మంత్రి కేటీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పారు.

- Advertisement -