గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొనడం గొప్పవరం- శ్రీనివాస్ గుప్త

117
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు. ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని, నాగోల్ లో ఉప్పల శ్రీనివాస్ గుప్త నివాసంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూప కర్త ఎంపీ రాజ్యసభసభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు.. తన 50వ పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా వారి కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటడం జరిగింది. ఆ తర్వాత కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ.. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం ఆనందంగా ఉందని చెప్పారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ కు హరితహారం కార్యక్రమంలో కోట్లాది మొక్కలు నాటుతూ..తెలంగాణను ఆకుపచ్చ తెలంగాణగా మారుస్తూ.. కలియుగ అశోక చక్రవర్తిలాగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని అన్నారు. సీఎం కేసీఆర్ మానస పుత్రికైన తెలంగాణ కు హరితహారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్పూర్తితో చేపట్టిన కార్యక్రమాలు భావితరాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు.ఈరోజు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొనటం గొప్పవరంలా భావిస్తున్నామని అన్నారు.

రాబోయే తరాలకు మంచి పర్యవరణాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని గుర్తు చేశారు. వృక్షో రక్షతి: రక్షితః ఒకప్పుడు అశోకుడు దారికి ఇరువైపులా మొక్కలు నాటి ప్రపంచమంతా తెలియజేశారు. ఇప్పుడు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమం ద్వారా, వందల కోట్ల మొక్కలు నాటించారు.అదే స్పూర్తితో రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ద్వారా మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలో మొత్తం మీద కొన్ని కోట్ల మొక్కలు నాటేలా చేస్తున్నారు కాబట్టి ఎంపీ సంతోష్ కుమార్ కి ధన్యవాదాలు తెలుపుతున్నాను.

అలాగే తెలంగాణ కు హరిత హరం కార్యక్రమంతో కూడా సీఎం కేసీఆర్ ఒక పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని కొన్ని కోట్ల మొక్కలు నాటించి, ప్రతి సంవత్సరం తెలంగాణ కు హరితహారం కార్యక్రమం తుచ తప్పకుండా అమలు పరుస్తున్నారని అన్నారు శ్రీనివాస్ గుప్త. ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చేపట్టి, గ్రీనరిలో భారత దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉండే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారని, చెట్లు ఎక్కడైతే ఎక్కువ వుంటాయో అక్కడ వానలు బాగా కురుస్తాయి.. పాడి పంటలు చాలా బాగుంటాయి అలాగే వాతావరణం కూడా బాగుంటుంది అని తెలిపారు.

దేశ వ్యాప్తంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తరువాత 24% ఉన్న గ్రీనరిని 32% పర్సెంట్ కు పెంచడం జరిగింది అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చాలా అద్భుతమైన కార్యక్రమం అని, ఇంత మంచి కార్యక్రమంలో ఇలాగే ప్రతి ఒక్కరు పాల్గొని మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాలని ఈ సందర్భంగా శ్రీనివాస్ గుప్త పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ద్వారా ప్రజల్లో చైతన్యం నింపడం పట్ల ఎంపీ సంతోష్ కుమార్ కృషిని అభినందిస్తూ..అందుకు స్ఫూర్తినిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు శ్రీనివాస్ గుప్త.

ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గుప్తతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, శ్రేయోభిలాషులు, IVF రాష్ట్ర మరియు జిల్లా స్థాయి అన్ని విభాగాల సభ్యులు,TRS నాయకులు, ఆర్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -