హరిత హోటల్స్ ది బెస్ట్‌గా ఉండేలా కృషి: ఉప్పల శ్రీనివాస్

243
uppala srinivas
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు. హైదరాబాద్ బేగంపేటలో ఉన్న టూరిజం ప్లాజాలో టూరిజం అభివృద్ధి పై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హెచ్.ఓ.డీలు, యూనిట్ మేనేజర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడారు.

రాష్ట్రంలో టూరిజం డెవలప్మెంట్ కోసం అందరూ అన్ని విధాలుగా కృషి చేయాలని సూచించారు. టూరిస్టులకు అన్ని రకాల వసతులు కల్పించి ఆదాయం పెంచే విధముగా ముందుకు పోవాలన్నారు. హరిత హోటల్స్, బోటింగ్, రెస్టారెంట్ల నిర్వహణ సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ సమావేశంలో yat & c secretary శ్రీనివాస రాజ్, ఎండి మనోహర్ రావు, టీఎస్టీడీసీ ప్రాజెక్ట్స్ ఎస్సిక్యూటివ్ డైరెక్టర్ శంకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -