64వ రోజు.. ఉప్పల ఫౌండేషన్ అన్నదానం..

225
uppala foundation
- Advertisement -

టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పలశ్రీనివాస్ గుప్త లాక్ డౌన్ నేపథ్యంలో ఉప్పల ఫౌండేషన్ తరపున చేస్తున్న సేవా కార్యక్రమాలు 64వ రోజుకు చేరుకున్నాయి. ఈరోజు ఇబ్రహీంపట్నం నియోజకకర్గంలోని పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ పరిధిలోని గల ఆర్కే నగర్ 15,16 వార్డుల్లో ఉప్పల శ్రీనివాస్ గుప్త 15 వార్డు టీఆర్ఎస్ కౌన్సిలర్ అర్చన దామోదర్‌తో కలిసి బిర్యానీ ప్యాకెట్లు పంచారు.

అలాగే జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాలతోపాటు నాగోల్ లోని శ్రీనన్న నివాసం వద్ద మొత్తం 2వేల మందికి బిర్యానీ ప్యాకెట్లు అందజేశారు. అలాగే వనస్థలిపురంలోని కరుణ జ్యోతి ట్రస్ట్‌కు, నాగోల్ లోని వాత్సల్యం ఆర్గనైజేషన్‌కు, మనుసురాబాద్‌లోని సద్గురు ఓల్డేజ్ హోంలకు బిర్యానీ ప్యాకెట్లు అందించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఐవీఎఫ్ నాయకులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

- Advertisement -