ఆ ఇద్దరు స్టార్లు కోర్టును ఆశ్రయించారు

25
- Advertisement -

స్టార్ హీరోలకు లక్షలాది మంది అభిమానులు ఉంటారు. వారు ఏం చేసినా గొప్పగానే చెప్పుకుంటూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు ఇద్దరు స్టార్ హీరోలు కోర్టును ఆశ్రయించడంతో వారి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. తమ హీరోకి ఇలాంటి పరిస్థితి రావడం ఏమిటి అంటూ వారంతా తెగ దిగులు చెందుతున్నారు. ఇంతకీ ఆ స్టార్ హీరోలు ఎవరు ?, వాళ్ళు కోర్టు మెట్లు ఎందుకు ఎక్కారు ?, అందుకు గల కారణం ఏమిటి ? వంటి ఆసక్తికర విషయాలు తెల్సుకుందాం రండి.

ముందుగా ప్ర‌ముఖ క‌న్న‌డ న‌టుడు ఉపేంద్ర విషయానికి వద్దాం. ఆయన తాజాగా కోర్టు మెట్లెక్కారు. తనపై వివిధ పోలీస్ స్టేష‌న్‌ల‌లో నమోదైన FIRలను రద్దు చేయాలని హైకోర్టును ఆశ్ర‌యించారు. ఇటీవ‌లె ‘ప్రజాకీయ పార్టీ’ ఆరేళ్ల వార్షికోత్సం సందర్భంగా ఉపేంద్ర చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌పై దళిత సంఘాలకు చెందిన నేతలు వివిధ పోలీస్ స్టేషన్‌ల‌లో కేసులు పెట్టారు. నిజానికి ఉపేంద్ర తాను చేసిన కామెంట్స్ పై క్షమాపణలు చెప్పారు. అయినా, కేసులు పెడుతూనే ఉన్నారు. దీంతో ఉపేంద్ర హైకోర్టును ఆశ్రయించారు.

అలాగే మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ పోలీసులను ఆశ్రయించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కొంతమంది తనని అవమానించేలా, పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ సంబంధిత సోషల్ మీడియా పోస్టులతో పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న కమిషనర్.. అనంతరం ఈ కేసును పనంగడ్ స్టేషను బదిలీ చేశారు. ఈ విషయంపై దర్యాప్తు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

Also Read:శ్రావణమాసం విశిష్టత..

- Advertisement -