కరోనా నుండి కోలుకున్నా ఉపాసన..

84
Upasana
- Advertisement -

మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ భార్య ఉపాసన గతవారం కరోనా బారిన పడ్డారు. గత వారం తాను కరోనా బారిన పడ్డానని ఆమె తెలింది. వైద్యుల సూచనతో వారం రోజుల పాటు ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్నానని చెప్పారు. ప్రస్తుతం కోలుకున్నానని ఆమె అన్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమె వెల్లడించారు.

చెన్నైలో ఉన్న తాతయ్య, అమ్మమ్మల వద్దకు వెళ్లేందుకు కోవిడ్ టెస్ట్ చేయించుకున్నానని… ఈ పరీక్షలో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని చెప్పింది ఉపాసన. అయితే ముందే వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల స్వల్ప లక్షణాలు కనిపించాయని అన్నారు. కేవలం పారాసెటమాల్, విటమిన్ ట్యాబ్లెట్లను మాత్రం వేసుకుంటే సరిపోతుందని వైద్యులు సూచించారని తెలిపింది. తనకు కరోనా సోకడంతో బాడీ పెయిన్స్, జుట్టు ఊడిపోవడం, నీరసం వంటి సమస్యలు రావచ్చని కొందరు చెప్పారని… అయితే తనకు అలాంటి సమస్యలు ఎదురు కాలేదని తెలిపారు. కరోనా మళ్లీ విజృంభిస్తుందా అంటే ఏమీ చెప్పలేం. మన జాగ్రత్తల్లో ఉండటం చాలా అవసరం. తాతయ్య ఇంటికి వెళ్తూ టెస్ట్‌ చేయించుకున్నాను కాబట్టి నాకు తెలిసింది.. లేకపోతే తెలిసేదికాదు. విశ్రాంతి తీసుకుంటూనే మళ్లీ లైఫ్‪ని ప్రారంభించేందుకు సిద్ధమయ్యా అని ఉపాసన పేర్కొంది.

- Advertisement -