ముక్కోటి ఏకాదశి.. వెంకన్న సన్నిధిలో కేటీఆర్,హరీష్..

293
- Advertisement -

నేడు ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గోవిందుని దర్శనం చేసుకునేందుకు భక్తులు తెల్లవారుజూమునుంచే భక్తులు క్యూ లైన్‌లో బారులు తీరారు. తెల్లవారక ముందే భక్తులు ఆలయాలకు చేరుకుని స్వామి వార్లను దర్శించుకుంటున్నారు. ప్రత్యేక పూజల్లో మునిగితేలుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల వేంకటేశుని దర్శించుకునేందుకు పలువురు ప్రముఖులు తరలివచ్చారు.

ktr

సందర్భంగా మంత్రి కేటీఆర్ కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అలాగే హరీశ్‌రావు, తలసాని, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సినీ ప్రముఖులు సుమలత, రాజేంద్రప్రసాద్, సునీల్, సప్తగిరి ప్రసాద్ శ్రీవారిని దర్శించుకున్నారు.

harish

తెలంగాణలోని భద్రాద్రి ఆలయం కూడా భక్తులతో కిటకిటలాడుతోంది. తెలంగాణ మంత్రులు పువ్వాడ అజయ్ దంపతులు, సత్యవతి రాథోడ్‌లు ఇప్పటికే దర్శనం చేసుకున్నారు. ఉదయం ఆరు గంటల వరకు ఉత్తరద్వార దర్శనం కొనసాగింది. మంగళగిరిలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోనూ ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి.

- Advertisement -