దేశంలోని రాజకీయ పార్టీల అధ్యక్షులకు కేంద్రమంత్రి లేఖ

284
Prahlad_Joshi
- Advertisement -

దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకు లేఖ రాశారు కేంద్రమంత్రి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద జోషి. ఈనెల 19వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహిస్తున్న అన్ని పార్టీల అధ్యక్షుల సమావేశానికి హాజరుకావాలని లేఖలో కోరారు. ఈసమావేశంలో ప్రధాని నరేంద్రమోదీ కూడా పాల్గోంటారని తెలిపారు.

దేశంలో అన్ని చట్ట సభలకు ఒకేసారి ఎన్నికలు, ‘ఆస్పిరేషనల్‌ డిస్ట్రిక్ట్స్‌’ అభివృద్ధి, 75వ స్వాతంత్ర్య వేడుకల నేపథ్యంలో ‘నవభారత నిర్మాణం’, పార్లమెంట్ సమావేశాలు మరింత ఫలవంతంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకున్న మార్గాలు, మహాత్మ గాంధీ 150వ జయంతి ఉత్సవాల నిర్వహణ తదితర అంశాలపై ఈ భేటీలో చర్చిస్తామని ప్రహ్లాదజోషి చెప్పారు. ఈసందర్భంగా టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, వైసిపి అధ్యక్షుడు జగన్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు లేఖలు పంపించారు.

- Advertisement -