కేంద్ర బడ్జెట్‌తో పలు వస్తువుల ధరల్లో మార్పులు..

516
Union Budget 2020
- Advertisement -

ఈరోజు 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. నరేంద్రమోదీ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన రెండో బడ్జెట్‌ ఇది. నిర్మలా సీతారామన్ తన అత్యంత సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగంలో గణాంకాలను, ఇతర వివరాలను చదివి వినిపించారు. ఎప్పట్లానే బడ్జెట్ అంటే కొన్ని వస్తువులపై ధరలు పెరగడం, కొన్నింటిపై తగ్గడం సహజం. ఈ బడ్జెట్‌లో ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే.

బడ్జెట్‌తో ధరలు తగ్గేవి.. ప్లాస్టిక్ ఆధారిత ముడిసరుకు,విదేశాల నుంచి దిగుమతి చేసుకునే న్యూస్ ప్రింట్,మొబైల్ ఫోన్ల స్పేర్ పార్టులు,ఎలక్ట్రిక్ వాహనాలు,ముడి పంచదార,వ్యవసాయాధారిత, జంతు సంబంధ ఉత్పత్తులు,కొన్నిరకాల మద్యం,పలు రసాయనాలు,

బడ్జెట్‌తో ధరలు పెరిగేవి.. కమర్షియల్ వాహనాల స్పేర్ పార్టులు,సిగరెట్లు,వాల్ మౌంటెడ్ ఫ్యాన్లు,స్కిమ్డ్ మిల్క్,టేబుల్ వేర్,పొగాకు ఉత్పత్తులు,వైద్య పరికరాలు,సోయా ఫైబర్, సోయా ప్రొటీన్,కిచెన్ ఉపకరణాలు,రాగి, ఉక్కు, క్లే ఐరన్,ఫర్నిచర్,చెప్పులు,

- Advertisement -