- Advertisement -
ఉక్రెయిన్పై బాంబుల వర్షం కురిపిస్తోంది రష్యా. సైనిక, వైమానిక స్థావరాలు, ఆయుధ కేంద్రాలపై రష్యా సైన్యం బాంబుల వర్షం కురిపించింది. మిలిటరీ ఆపరేషన్ ప్రారంభించిన కొన్ని గంటల్లోనే ఉక్రెయిన్లోని మెరియోపోల్, లుహాన్స్క్, షాష్ట్యా, క్రమెటోస్క్, సెన్కివ్కా, వీవ్, ఇవాన్ ఫ్రాంక్ఇవ్స్క్ వంటి ప్రధాన ప్రాంతాలపై దాడులు చేయగా ఈ దాడుల్లో 137 మంది చనిపోయారని ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రకటించారు.
ఉక్రెయిన్ రాజధాని కీవ్కు సమీపంలో ఉన్న చెర్నోబిల్ అణువిద్యుత్ కేంద్రాన్ని ఆక్రమించుకున్న రష్యా సైన్యం రాజధానికి సమీపంలో ఉన్న విమానాశ్రయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. ఏ క్షణమైనా కీవ్ను రష్యా బలగాలు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. రష్యాను సమర్ధంగా ఎదురుకోవడానికి పూర్తిస్థాయిలో సైనికులను మోహరించాలని జెలెన్స్కీ ఆదేశించారు.
- Advertisement -