సీఎం కేసీఆర్‌కు మద్దతుగా ఎన్నారైలు

172
- Advertisement -

సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ జాతీయ పార్టీ ఏర్పాటు నేపథ్యంలో ఎన్నారైలు పూర్తి మద్దతు ప్రకటించారు. యుకేలోని ఎన్నారైలు సుమన్ రావు బాలమూరి ఆధ్వర్యంలో దేశం కోసం కేసీఆర్…కేసీఆర్ కోసం ఎన్నారైలు అంటూ భారీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా సుమన్‌ రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ దేశ ప్రజల శ్రేయస్సు కోసం బీఆర్ఎస్‌ను స్థాపించడం శుభపరిణామమన్నారు.నాడు టీఆర్‌ఎస్‌ లానే.. నేడు బీఆర్‌ఎస్ స్థాపన, కార్యాచరణ, ప్రణాళిక బద్ధంగా ఉంటుందని ఆశిస్తున్నామన్నారు. బీఆర్‌ఎస్‌లో ఎన్‌ఆర్‌ఐలు కీలక పాత్ర పోషిస్తారని, త్వరలో పార్టీ పెద్దలని కలుస్తామని వెల్లడించారు.

బీఆర్‌ఎస్‌లో పనిచేయడానికి, భావజాలాన్ని దేశ వ్యాప్తం చేయడానికి బాధ్యత తీసుకుంటామని చెప్పారు. త్వరలో యూకేలో ఉన్న వివిధ రాష్ట్రాల ఎన్‌ఆర్‌ఐలతో సమావేశాలు ఏర్పాటు చేసి మద్దతు కూడగడతామని వెల్లడించారు.

- Advertisement -