మహర్షికి రెండు జాతీయ అవార్డులు..

74
- Advertisement -

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం మహర్షి. వీకెండ్ వ్యవసాయం కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్‌ చిత్రంగా నిలిచింది. మహేష్‌ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది.

తాజాగా ఈ చిత్రానికి రెండు జాతీయ అవార్డులు దక్కాయి. ఈ చిత్రాన్ని నిర్మించిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈరోజు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ‘మహర్షి’ సినిమాకు గానూ రెండు నేషనల్ అవార్డ్స్ అందుకున్నారు.

ఒకటి ఉత్తమ వినోదం, రెండవది బెస్ట్ కొరియోగ్రఫీ. కొరియోగ్రాఫర్ రాజు సుందరం ఈ ఈవెంట్‌కి హాజరుకాలేకయారని తెలుస్తోంది. ఈ యాక్షన్ డ్రామా మంచి సామాజిక సందేశంతో తెరకెక్కగా, ఇందులో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించింది. అల్లరి నరేష్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించాడు.

- Advertisement -