మంత్రి ఎర్రబెల్లి కాన్వాయ్‌లో ప్రమాదం..ఇద్దరు మృతి

636
Errabelli Dayakar Rao Car Incident
- Advertisement -

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు కాన్వాయ్‌లో ఓ వాహనం బోల్తా పడిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం చిటూరు వద్ద ఈ ప్రమాదం జరిగింది. మంత్రి దయాకర్‌ రావు హైదరాబాద్‌ నుంచి పాలకుర్తి వైపు వెళ్తుండగా.. మంత్రి కాన్వాయ్‌లోని ఎస్కార్ట్‌ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది.

దీంతో కారు డ్రైవర్‌ పార్థసారధి, సోషల్‌ మీడియా ఇన్‌చార్జి పూర్ణ అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారిలో గన్‌మన్ నరేష్, అటెండర్ తాతారావు, పీఏ శివ ఉన్నారు.. యశోద ఆస్పత్రికి తరలించి వారిని చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.మంత్రి దయాకర్‌రావు ఆస్పత్రికి చేరుకుని గాయపడిన వారిని పరామర్శించారు.

- Advertisement -