Twitter:జగన్‌ – సమంతకు షాక్

44
- Advertisement -

ట్విట్టర్ సీఈవోగా ఎలాన్ మస్క్ బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుండి సమూల మార్పులకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఎన్ని విమర్శలు వచ్చినా ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు మస్క్. తాజాగా కొంతమంది సెలబ్రెటీల బ్లూ టిక్‌లను తొలగించారు మస్క్. ఇందులో కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంకతో పాటు ఏపీ సీఎం జగన్,మాజీ సీఎం చంద్రబాబు,పవన్ కల్యాణ్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ,సమంత,అమితాబ్ తదితరులు ఉన్నారు.

Also Read:నిమ్మరసంతో ఇన్ని ఉపయోగాలా!

నిన్నటి నుండి వారి ఖాతాలకు బ్లూ టిక్ కనబడటం లేదు. బ్లూటిక్ కావాలంటే డబ్బులు కట్టాల్సిందేనని తేల్చి చెప్పింది ట్విట్టర్. సబ్‌స్క్రైబ్ చేసుకోని వారి ఖాతాకు బ్లూటిక్ తొలగిస్తామని తెలపినట్టే అన్నంత పని చేసింది.

టాలీవుడ్ లో మహేశ్ బాబు, ఎన్టీఆర్ వంటి హీరోలు ముందుగానే జాగ్రత్త పడడంతో వారి బ్లూటిక్ పోలేదు. ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఆ మైక్రోబ్లాగింగ్ సైట్ యూజర్లకు షాకులు ఇస్తూనే ఉన్నారు.

Also Read:IPL2023:చెన్నై ముందు ‘సన్ రైజర్స్ ‘ నిలిచేనా?

- Advertisement -