టీటీడీకి ద్విచక్ర వాహనం విరాళం

33
- Advertisement -

తిరుమ‌ల శ్రీ‌వారికి మంగళవారం టివిఎస్‌ సంస్థ టివిఎస్ అపాచీ ఆర్టీఆర్ 310 ద్విచక్ర వాహనాన్ని విరాళంగా అందించింది. ఈ వాహనం ధర రూ.3 ల‌క్ష‌ల 5వేలు అని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ముందుగా అలయం వద్ద ఈ వాహనానికి పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం సంస్థ ఎండి మ‌రియు టీటీడీ బోర్డు స‌భ్యులు శ్రీ సుద‌ర్శ‌న్ వేణు వాహనం తాళాలను టీటీడీ ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డికి అందజేశారు.ఈ కార్య‌క్ర‌మంలో తిరుమల డిఐ జానకిరామ రెడ్డి, సంస్థ ప్ర‌తినిధులు రాజారెడ్డి, భ‌క్త‌వత్స‌లం, సిద్ధార్థ్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Also Read:ఢిల్లీ దొరలు వర్సెస్ తెలంగాణ ప్రజలు!

- Advertisement -