టీటీడీకి టీవీఎస్ మోటర్స్ విరాళం..

37
- Advertisement -

టీటీడీకి టీవీఎస్ మోటర్స్ విరాళం అందించింది. దాదాపు రూ.30 ల‌క్షల విలువైన 25 ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లను విరాళంగా అందించింది. ఈ మేర‌కు టీవీఎస్ సంస్థ ప్రతినిధులు శ్రీ‌వారి ఆల‌యం ఎదుట ఈ ద్విచ‌క్ర వాహ‌నాల‌కు పూజలు నిర్వహించి వాటి తాళాల‌ను టిటిడి ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డికి అంద‌జేశారు.

ఈ సందర్భంగా టీవీఎస్ సంస్థ ప్రతినిధులను అభినందించారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. తిరుమ‌ల ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్షణ‌కు ఉప‌యోగ‌ప‌డే విధంగా ఎల‌క్ట్రిక్ వాహ‌నాలను అందించిన టీవీఎస్ సంస్థకు ధ‌న్యవాదాలు తెలిపారు. టీవీఎస్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ సెల్వం, వైస్ ప్రెసిడెంట్ మ‌నోజ్ స‌క్సేనా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -