మొక్కలు నాటిన సీరియల్ నటి మంజీర..

271
gc
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పిలుపు మేరకు మొక్కలు నాటారు సీరియల్ నటి మంజీర. పర్యావరణాన్ని కాపాడడం మన అందరి బాధ్యత అని సీరియల్ నటి మంజీర అన్నారు.

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో నేను ఒక బాధ్యత గా మొక్కలు నాటినందుకు గర్వంగా ఉందని , దీనితో పాటు సీడ్ గణేష్ అనే కొత్త కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకెళ్తున్న జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ బుల్లితెర నటుడు అనిల్ అల్లం విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ అత్తాపూర్ లోని తన నివాసంలో మొక్కలు నాటింది.గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.అనంతరం తాను ఇంస్టాగ్రామ్ వేదిక ద్వారా మరో ముగ్గురికి ఛాలెంజ్ విసురుతానని సీరియల్ నటి మంజీర తెలిపారు.

- Advertisement -