తిరుమల అప్‌డేట్…

62
- Advertisement -

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 14 గంటల సమయం పడుతుండగా 24 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. 39,142 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.82 కోట్లు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు.

అక్టోబ‌రు నెల‌కు సంబంధించి స్వామి వారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను టీటీడీ ఆగ‌స్టు 24న విడుదల చేయనుంది. బుధ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో సేవా టికెట్లను టీటీడీ విడుదల చేయ‌నుంది. అదేవిధంగా, అక్టోబ‌రు నెల‌కు సంబంధించి మ‌రికొన్ని ఆర్జిత‌సేవా టికెట్లకు ఆన్‌లైన్ ల‌క్కీడిప్ న‌మోదు ప్ర‌క్రియ ఆగ‌స్టు 24న మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు మొద‌లుకానుంది.

- Advertisement -