TTD:చిక్కిన చిరుతపులి

29
- Advertisement -

టిటిడి అటవీ శాఖ, రాష్ట్ర అటవీ శాఖల సంయుక్త కృషి ఫలితంగా సోమవారం తెల్లవారుజామున శేషాచల అడవుల్లో ఓ చిరుత పులి చిక్కుకుంది.టీటీడీ అటవీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, ఘంట మండపం మధ్య మూడు బోనులను ఉంచారు. బోనులో చిక్కుకున్న చిరుత పులి వయసు ఐదేళ్లకు పైబడిన మగ చిరుతగా అటవీ అధికారులు నిర్ధారించారు. ఈ చిరుతను ఎస్వీ జూ పార్కుకు పంపారు.

టీటీడీ ఈవో ఏవి. ధర్మారెడ్డి కూడా సోమవారం చిరుతపులిని పట్టుకున్న ప్రదేశాన్ని సందర్శించారు.

Also Read:47 ఏళ్ల వయసులో మళ్లీ డిమాండ్

- Advertisement -