శ్రీవారి పోటు కార్యకలాపాలపై ఈవో సమీక్ష

16
- Advertisement -

శ్రీవారి పోటులో లడ్డూ ప్రసాదాలు తయారు చేసే పోటు కార్మికుల విధుల గురించి టీటీడీ ఈవో జె.శ్యామల రావు సుదీర్ఘంగా అధ్యయనం చేశారు. గోకులం విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో ఈవో, జేఈవో శ్రీ వీరబ్రహ్మంతో కలిసి పోటు కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు.

ఇందులో భాగంగా, బూందీ తయారీ, చక్కర కలపడం, జీడిపప్పును బూందీలో కలపడం, లడ్డును తయారుచేసి, లడ్డు కౌంటర్లోకి పంపడం, లడ్డు ప్రసాదం పంపిణీ తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సంబంధిత అధికారులు ఈవోకు వివరించారు.

Also Read:జూలై 26 న గల్లీ గ్యాంగ్ స్టార్స్

- Advertisement -