TTD: గోవులను రక్షించుకుందాం..

4
- Advertisement -

వేదాలు, పురాణాల్లో పేర్కొన్న విధంగా సకల దేవతాస్వరూపాలైన గోవులను రక్షించుకుని, సనాతన హైందవ ధర్మాన్ని కాపాడుకోవాలని టిటిడి ఈవో  జె. శ్యామలరావు పిలుపునిచ్చారు.తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర గోసంరక్షణశాలలో మంగళవారం గోకులాష్టమి గోపూజ మహోత్సవం ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా టిటిడి ఈవో మాట్లాడుతూ, భారతీయ సంస్కృతిలో గోవుకు ప్రముఖ స్థానం ఉందన్నారు. గోవును హిందువులు గోమాతగా పూజిస్తారని, తద్వారా పాడిపంటలు వృద్ధి చెంది దేశం సస్యశ్యామలం అవుతుందన్నారు. గో శాలలో పశువుల షెడ్ల వద్ద ఉంచిన బెల్లం, బియ్యం, పశుగ్రాసాన్ని భక్తులు స్వయంగా పశువులకు తినిపించే అవకాశాన్ని టిటిడి కల్పించిందని వివరించారు.

అనంతరం తిరుపతి ఎంఎల్ఏ శ్రీ శ్రీనివాసులు మాట్లాడుతూ, గోవు గొప్పతనాన్ని భావితరాలకు అందించేందుకు టిటిడి గోపూజ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాల‌న్నారు. గోశాల‌లో గోకులాష్ట‌మి గోపూజకు చాల ప్రాదాన్యత ఉందన్నారు. గోవును పూజించడం వలన పాడిపంటలు పుష్కలంగా పండి లోకం సుభిక్షంగా వుంటుందని తెలిపారు.

అంతకుముందు ఈవో దంపతులు గో పూజ నిర్వ‌హించారు. అనంత‌రం శ్రీ వేణుగోపాల స్వామివారికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.

Also Read:CM Revanth: సెప్టెంబర్ 17 నుంచి ప్రజా పాలన

- Advertisement -