TTD: మాడ వీధులను తనిఖీ చేసిన ఈవో

2
- Advertisement -

తిరుమల శ్రీవారి ఆలయ నాలుగు మాడవీధులను టిటిడి ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సివిఎస్ఓ శ్రీధర్ మరియు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. అనంతరం బ్రహ్మోత్సవాల్లో విశేషమైన గరుడసేవకు ఏర్పాట్లను పరిశీలించారు.

ఇందులో భాగంగా, జిల్లా పోలీసులతో పాటు టీటీడీ ఉన్నతాధికారులు వాహన మండపం నుండి తనిఖీలు ప్రారంభించి, వివిధ గ్యాలరీల్లోని ప్రవేశ నిష్క్రమణ మార్గాలను, గరుడ సేవలో గ్యాలరీలను రెండవసారి నింపడం, తదితర భద్రతా అంశాలు పరిశీలించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున చక్రస్నానం, ఇతర సంబంధిత అంశాలపై స్వామి పుష్కరిణి లోపలికి మరియు వెలుపలికి వచ్చే మార్గాలను పరిశీలించి పలు సూచనలు చేశారు.

అనంతరం మీడియా ప్రతినిధులతో ఈవో మాట్లాడుతూ, అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నాయని తెలిపారు. టిటిడి నిఘ మరియు భద్రత విభాగము, పోలీసుల సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా తిరుమలకు వచ్చే భక్తులను ఉచితంగా చేరవేసే ధర్మ రథాలను పరిశీలించారు.

Also Read:ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: వాద్రా

- Advertisement -