TTD:వేదాలు విజ్ఞాన భాండాగారాలు

5
- Advertisement -

వేదాలు విజ్ఞాన భాండాగారాల‌ని, ఆధునిక మాన‌వ స‌మాజం శాంతి సౌఖ్యాల‌తో జీవించ‌డానికి వేదాలు, ఆధునిక శాస్త్రాలను మిళితం చేయాల్సిన అవసరం ఉందని, ప్రపంచ వేద విజ్ఞాన కేంద్రంగా ఎస్వీ వేద విశ్వవిద్యాలయం పెంపొందాల‌ని టీటీడీ ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి ఉద్ఘాటించారు.

శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం, భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ, భారతీయ విజ్ఞాన వ్యవస్థల విభాగం సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలో బుధవారం ప్రారంభమైన నాలుగు రోజుల విశ్వ వైదిక విజ్ఞాన సమ్మేళనంలో ఈవో ముఖ్య అతిథిగా ప్రారంభోపన్యాసం చేశారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ, వేదాల్లో ఆధ్యాత్మిక జ్ఞానంతో పాటు సాంకేతిక ప‌రిజ్ఞానం దాగి ఉంద‌న్నారు. ఆధునిక శాస్త్రాలను వేద శాస్త్రాలను కలపడం ద్వారా పరిమితులకు మించి, వినూత్న ఆవిష్కరణల‌ను తీసుకురావడానికి ఈ స‌మ్మేళ‌నం ఒక వేదికగా పనిచేయాలని ఆకాంక్షించారు. ఆధునిక శాస్త్రాలు అన్ని ప్రశ్నలకు మూలం అయినప్పుడు, అన్ని సమాధానాలకు వేద శాస్త్రాలు మూలమని చెప్పారు. మానవ జాతి శ్రేయస్సుకు ఉపయోగపడే కొత్త పరిష్కారాలను అన్వేషించడానికి రెండింటినీ కలుపుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. శాస్త్రోక్తమైన, ధార్మిక విధానాలు రెండింటినీ మేళవించి పది రోజుల పాటు దాదాపు 7-8 లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనాన్ని క‌ల్పించిన‌ట్లు ఆయ‌న వివ‌రించారు.

తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం స్థాపనలో వైదిక ధర్మ పరిరక్షణ, ప్రచారంతో పాటు, భవిష్యత్ తరాలకు మానవాళికి ఉపయోగపడే నూతన, సుస్థిర పద్దతుల‌ను స్థాపించడం కోసం వేద మరియు ఆధునిక శాస్త్రాలు రెండింటినీ ఏకతాటిపైకి తీసుకురావడమే టీటీడీ ప్రధాన లక్ష్యమ‌ని ఈవో నొక్కి చెప్పారు.

అంతకుముందు, న్యూ ల్లీలోని జాతీయ‌ సంస్కృత విశ్వవిద్యాలయం విసి ప్రొ. శ్రీనివాస వరఖేడి ప్రసంగిస్తూ, వేద శాస్త్రాలు స్థిరమైన అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నాయని, అఖండ విద్య వేద విద్య ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని సూచించారు. ఆధునిక శాస్త్రాలు సమస్యకు కారణాన్ని కనుగొనడంపై దృష్టి సారిస్తే, వేద శాస్త్రాలు ఏ సమస్యకైనా పరిష్కారాన్ని ఇస్తాయ‌న్నారు. ఆధునిక మరియు వేద శాస్త్రాలు కలిస్తేనే, వేద శాస్త్రాల నుండి ఒక కొత్త శాస్త్ర సాంకేతిక‌త‌ ఉద్భవిస్తుంద‌న్నారు. ఇది జరగాలంటే పండితులు, శాస్త్రవేత్తలను ఆహ్వానించాలని, వర్సిటీలో మరిన్ని స‌ద‌స్సులు, పరిశోధన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రఖ్యాత సంస్కృత పండితులు, శ్రీ చంద్రశేఖర సరస్వతీ విశ్వ మహా విద్యాలయ యూనివర్సిటీ విసి బ్రహ్మశ్రీ ప్రొ.కుటుంబ శాస్త్రి మాట్లాడుతూ, యజ్ఞోవైశ్రేష్ఠతమంకర్మ అని యజ్ఞముల ఆధారముగా ఈ విజ్ఞాన కర్మలన్నీ నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. అందువ‌ల‌న‌ యజ్ఞములు ఆచరించాల‌ని ఈ విశ్వములో అగ్ని ద్వారానే సమస్త మైనటువంటి కర్మలు నిర్వర్తింప‌బడుతున్నాయని చెప్పారు. దీనికి అనుగుణంగా వేద విశ్వ విద్యాలయంలో అనేక అంశాల‌పై ప‌రిశోద‌న‌లు జరగాలని ఆయ‌న సూచించారు.

Also Read:ఉత్త‌మ‌ బాల న‌టిగా సుకృతి వేణి

- Advertisement -