ఆర్టీసీ బస్సుల్లోనే శ్రీవారి దర్శన టికెట్లు..

298
ttd
- Advertisement -

శ్రీవారి భక్తులకు శుభవార్తను అందించింది టీటీడీ. ఇక‌పై దూర‌ప్రాంతాల నుంచి తిరుప‌తికి వ‌చ్చే భ‌క్తుల‌కు బ‌స్సుల్లోనే తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శించుకునేందుకు వెళ్లేవారి కోసం శీఘ్ర‌ద‌ర్శ‌నం టిక్కెట్లు అందుబాటులోకి తీసుకొచ్చింది.

ప్ర‌తిరోజూ 1000 టిక్కెట్లు అందుబాటులో ఉంచాల‌ని నిర్ణ‌యించింది. బ‌స్సు టిక్కెట్టుతో పాటు రూ.300 చెల్లిస్తే శీఘ్ర‌ద‌ర్శ‌నం టిక్క‌ట్టు కూడా బ‌స్సులోనే ఇస్తారు.ప్రతిరోజూ ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు శ్రీవారి శీఘ్ర దర్శనం కల్పించనున్నది.రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి, ఇత‌ర రాష్ట్రాల నుంచి క‌లిపి మొత్తం దాదాపుగా 650 బ‌స్సు స‌ర్వీసుల‌ను న‌డుపుతొంది ఏపీఎస్ఆర్‌టీసీ. సమ్మర్ వస్తుండటంతో ర‌ద్దీ మరింత‌గా పెరిగే అవ‌కాశం ఉండటంతో టీటీడీ తీసుకున్న నిర్ణయంతో భక్తులకు ఊరట లభించనుంది.

- Advertisement -