సుప్రభాత పారాయణంతో తెరుచుకున్న టీటీడీ..

409
ttd darshan
- Advertisement -

చంద్రగ్రహణంతో మూతపడిన ఆలయాలు ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నాయి. ఉదయం 4.45 గంటలకు టీటీడీ ఆలయ మహా ద్వారాన్ని తెరచి సుప్రభాత పారాయణంతో శ్రీవారిని మేలుకొల్పారు. ఒక్కొక్కటిగా ద్వారాలను తెరచి ఆలయాన్ని పూర్తిగా శుద్దిచేసి పుణ్యవాహచనం చేయడంతో గ్రహణ దోషం పోయింది.

బంగారు వాకిలి వద్ద ఉదయం 9గంటల నుండి వార్షిక ఉత్సవమైన అణివార ఆస్థానాన్ని టీటీడీ వైభవోపేతంగా నిర్వహించనుంది. ఉదయం 11గంటల తర్వాత సామాన్య భక్తులను శ్రీవారిని దర్శనానికి టీటీడీ అనుమతించనుంది.

ఉదయం 9 గంటలకు ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి. బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ఉదయం 8 గంటలకు సంప్రోక్షణ తర్వాత భక్తుల దర్శనానికి అనుమతిస్తున్నారు.ఇక భద్రాద్రి ఆలయంలో సంప్రోక్షణ అనంతరం ఉదయం 5 గంటల నుంచి దర్శనానికి అనుమతి ఇస్తున్నారు.

- Advertisement -