క్షమాపణ చెప్పకపోతే న్యాయపరమైన చర్యలు: సజ్జనార్

127
allu
- Advertisement -

అల్లు అర్జున్ , ర్యాపిడ్ సంస్థలు ఆర్టీసికీ క్షమాపణలు చెప్పి వెంటనే యాడ్ అపకపోతే న్యాయ పరంగా ముందుకు వెళతాం అన్నారు టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్.ర్యాపిడో యాడ్‌లో ఆర్టీసీని కించపరుస్తూ అల్లు అర్జున్ యాడ్‌ చేయగా ఆ సంస్థతో పాటు అల్లు అర్జున్‌కి లీగల్ నోటీసులు పంపారు సజ్జనార్.

యూట్యూబ్ లో ప్రసారం అవుతున్న ప్రకటనలో ఆర్టీసీ బస్సులు సాధారణ దోసెల మాదిరిగానే ఎక్కువ సమయం తీసుకుంటాయని, రాపిడో చాలా వేగంగా, సురక్షితంగా ఉంటుందని, అదే సమయంలో మసాలా దోసను సిద్ధం చేస్తుందని అల్లు అర్జున్ ప్రజలకు చెప్పడం సరికాదని అన్నారు సజ్జనార్.‌

ఈ ప్రకటనపై ఆర్టీసీ ప్రయాణీకులు, అభిమానులు, సంస్థ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులతో సహా అనేక వ్యక్తుల నుండి పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయని ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్ పేర్కొన్నారు. ర్యాపిడో సర్వీసులతో పోల్చి ఆర్టీసీ బస్సులను ప్రతికూలంగా చూపించడాన్ని ఖండిస్తున్నామని ఆయన‌ అన్నారు.

- Advertisement -