ఘనంగా రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి బర్త్ డే సెలబ్రేషన్స్

30
- Advertisement -

తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తన పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్ ఖైరతాబాద్ లోని తెలంగాణ రాష్ట్ర పునరుత్పాధక శక్తి అభివృద్ధి సంస్థ ప్రధాన కార్యాలయంలో… గౌరవ ఎంపీ సంతోష్ రావు గారి పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్క నాటారు. దేశంలో పచ్చదనం పెంచి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. అంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ లో భాగంగా చేపట్టిన హరితహారంతో రాష్ట్రంలో పచ్చదనం చాలా పెరిగిందన్నారు. ఫలితంగా వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయని, తాగు,సాగునీటి కష్టాలు లేకుండా పోయాయని అన్నారు. రేపు చేపట్టనున్న లక్ష వృక్ష అర్చనలో ప్పతీ ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తర్వాత రెడ్కో కార్యాలయంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్కో సంస్థ వైస్ చైర్మన్, ఎండీ జానయ్య గారు, జీఎం ప్రసాద్ గారు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా సభ్యులు.. సతీష్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు.

Also Read:ఆ రెండు చిత్రాల పరిస్థితేంటి?

- Advertisement -