సీఎం సహాయనిధికి టీఎస్‌పీఎస్సీ సభ్యుల విరాళం..

321
ktr
- Advertisement -

సీఎం సహాయనిధికి విరాళాలు వెల్లువెత్తుతునే ఉన్నాయి. తాజాగా శనివారం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ని కలిసి సీఎం సహాయనిధికి పలువురు విరాళాలు అందించారు.

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యులు కూడా తమవంతు సహాయం అందించారు. టీఎస్‌పీఎస్పీ ఛైర్మన్‌ ఘంటా చక్రపాణి, సభ్యులు కలిసి సీఎం సహాయనిధికి రూ.1.25లక్షల విరాళం చెక్కును అందజేశారు.

హెచ్‌ఎల్‌ఎల్‌ లైఫ్‌కేర్‌ సంస్థ రూ.48లక్షల విలువగల 200 హోండా హై ప్రెషర్‌ బ్యాక్‌ప్యాక్‌ స్ప్రేయర్స్‌ను విరాళంగా అందజేయగా మధుకాన్‌ షుగర్‌ అండ్‌ పవర్‌ ఇండస్ట్రీస్‌ సంస్థ రూ.1.50కోట్ల విలువైన శానిటైజర్లు, మాస్క్‌లను అందించింది. ఈస్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూ.73లక్షల విలువైన 5000 శానిటైజర్లు, నాలుగు లక్షల మాస్క్‌లను అందజేసింది. వీరందరికి ధన్యవాదాలు తెలిపారు మంత్రి కేటీఆర్.

- Advertisement -