మొక్కలు నాటిన న్యాయవాదులు..

222
green challenge
- Advertisement -

ఆకుపచ్చ తెలంగాణ సాధనలో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కూమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ ను అడ్వకేట్ జేఏసీ స్వీకరించి శెనిగచెర్ల గ్రామంలోని ఉషోదయ టైల్స్ కంపెనీ ఆవరణలో తెలంగాణ న్యాయవాదుల అధర్యంలో మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా తెలంగాణ ఫుడ్ కమిషన్ సభ్యులు కొంతం గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ మానవాళి మనుగడకు అవసరం అయిన భూమండలం వేడెక్కి జీవకోటికి ప్రమాదం ఏర్పడుతుంది అని వాతావరణ కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రతి వ్యక్తి జోగినిపల్లి సంతోష్ రావు గారి పిలుపుమేరకు మూడు మొక్కలు నాటి ఆకుపచ్చ తెలంగాణను చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధికార ప్రతినిధి ఉపేందర్; ఉషోదయ టైల్స్ ఎండీ సంపత్; రంగారెడ్డి జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవికుమార్ ;శ్రీధర్ రెడ్డి; కళ్యాణ రావు; కిరణ్ కుమార్; తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -