వర్క్‌ ఫ్రం హోంపై ప్రభుత్వం కీలక సూచనలు!

233
it
- Advertisement -

రాష్ట్రంలో వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌పై ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. సెప్టెంబ‌రు 1 నుంచి ఐటీ కంపెనీలు వ‌ర్క్ ఫ్రం హోం బంద్ చేయాలని సూచించింది. ఇందుకోసం ఓ కమిటీని ఏర్పాటుచేసింది. ఇందుకు ఐటీ సంస్థ‌లు అన్ని ఏర్పాట్లు చేసుకోవాల‌ని కోరింది. ఐటీ ఉద్యోగులంద‌రి కోసం స్పెష‌ల్ డ్రైవ్ నిర్వ‌హించి వ్యాక్సిన్లు వేస్తామ‌ని…ఆయా కంపెనీల వెలుప‌ల క‌రోనా ప‌రీక్ష‌ల కేంద్రాల‌ను ఏర్పాటు చేస్తామ‌ని ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్‌ హామీ ఇచ్చారు.

ఈ అంశంపై ఐటీ శాఖ ఉన్న‌తాధికారులు, ఐటీ కంపెనీల ప్ర‌తినిధుల‌తో ప్ర‌భుత్వం ఓ క‌మిటీని ఏర్పాటు చేసింది. కార్యాల‌యాల్లో ఉద్యోగుల‌తో విధులు నిర్వ‌హించేలా చేయ‌డం, అందుకు త‌గ్గ విధివిధానాల‌ను ఖ‌రారు చేయ‌డం వంటి అంశాల‌పై ఈ క‌మిటీ నివేదిక అందించ‌నుంది. కొన్ని రోజుల్లో ఈ క‌మిటీ స‌మావేశం కానుంది.

ఐటీ ఉద్యోగుల‌కు వ‌ర్క్ ఫ్రం హోం ఇవ్వ‌డం వ‌ల్ల ఐటీ కంపెనీలు, ఆ సంస్థ‌ల ఉద్యోగుల‌కు మేలు జ‌రుగుతున్న‌ప్ప‌టికీ వారి మీద ప‌రోక్షంగా ఆధార‌ప‌డి వ్యాపారాలు చేసుకుంటోన్న వారికి మాత్రం న‌ష్టాలు వ‌స్తున్న‌ట్లు తెలుస్తోంది. అంటే రియ‌ల్ ఎస్టేట్, ట్రాన్స్‌పోర్ట్, ఆతిథ్య రంగాల వంటి వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐటీపై ఇత‌ర రంగాలు ఆధార‌ప‌డ‌డంతో ప్ర‌భుత్వం ఆ సంస్థ‌ల ఉద్యోగుల‌ను కార్యాల‌యాల నుంచే ప‌నిచేసుకోనివ్వాల‌ని భావిస్తోంది. దీనిపై ఏర్పాటు చేసిన క‌మిటీ ఆగ‌స్టు మొద‌టి వారంలో తుది నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంది.

- Advertisement -