కల్నల్ సంతోష్ కుటుంబానికి అండగా తెలంగాణ ప్రభుత్వం…

167
minister jagadish reddy
- Advertisement -

కల్నల్ సంతోష్‌ బాబు కుటుంబానికి ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని తెలిపారు మంత్రి జగదీష్‌ రెడ్డి.వీర జవాన్ సంతోష్ బాబుకు అశ్రునయనాలతో కడసారి వీడ్కోలు పలికిన అనంతరం మీడియాతో మాట్లాడిన జగదీష్ రెడ్డి …దేశం కోసం ప్రాణలను అర్పించిన కల్నల్ సంతోష్ బాబు ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడి గా నిలిచిపోయారని చెప్పారు.

ఆయన త్యాగం,ధైర్య సాహసాలు,తెగువ నేటి యువతకు ఆదర్శప్రాయం అని ఏమి ఇచ్చిన ఆయన రుణం తీర్చుకోలేమన్నారు.సంతోష్ బాబు పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా సూర్యాపేట పట్టణంలో ని ప్రధాన కూడలి కి ఆయన పేరు పెట్టి అభివృద్ధి చేసి గౌరవించుకుంటామన్నారు.

ఆయన అంత్యక్రియలు జరిగిన ప్రాంతాన్ని సుందరంగా అభివృద్ధి చేస్తాం…ఆయన కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. వారి పిల్లలు ఉన్నత చదువులు చదువుకోడానికి ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

- Advertisement -