- Advertisement -
కిన్నెర వాయిద్య కళాకారుడు దర్శనం మొగులయ్యకు సీఎం కేసీఆర్ భారీ నజరానా ప్రకటించిన విషయం తెలసిందే.. అంతేకాదు హైదరాబాద్లో ఇంటి స్థలంతోపాటు ఇంటి నిర్మాణ ఖర్చు, ఇతరత్రా అవసరాల కోసం కోటి రూపాయల రివార్డ్ ప్రకటించారు. ఇటీవల ఆయన పద్మశ్రీ అవార్డు దక్కించున్న సంగతి తెలిసిందే. అయితే సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.
ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా, పద్మశ్రీ కిన్నెరమెట్ల మొగిలయ్య కు రూ 1కోటి నగదు పురస్కారాన్ని ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పద్మశ్రీ మొగిలయ్య కోరుకున్నట్టుగా బిఎన్ రెడ్డి నగర్ కాలనీలో నివాస యోగ్యమైన ఇంటి స్థలాన్ని కూడా కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
- Advertisement -