తెలంగాణ భవన్‌లో ఆవిర్భావ వేడుకలు..

11
- Advertisement -

ఇవాళ తెలంగాణ భవన్‌లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుగనున్నాయి. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో మూడురోజుల వేడుకల్లో భాగంగా రెండోరోజైన ఆదివారం ఉదయం బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ జాతీయ జెండాను ఎగురవేస్తారు.

అనంతరం తెలంగాణ భవన్‌లో నిర్వహించే సమావేశానికి కేసీఆర్‌ హాజరై ప్రసంగిస్తారు. ఈనెల 3న బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయాల్లో పార్టీ అధ్యక్షులు జాతీయ జెండాను ఎగురవేస్తారు. దవాఖానల్లో పండ్లు, మిఠాయిలు పంచిపెడుతారు.

శనివారం గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపానికి పుష్పాంజలి ఘటించి, జ్యోతిని వెలిగించి ఘన నివాళి అర్పించారు కేసీఆర్. కొవొత్తిని వెలిగించి గన్‌పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపం నుంచి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయం ఎదురుగా ఉన్న అమరజ్యోతి వరకు జరిగిన కొవ్వొత్తుల ర్యాలీని ప్రారంభించారు. కేటీఆర్‌, హరీష్‌తో పాటు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

Also Read:తెలంగాణ..ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు

- Advertisement -