రేపు సికింద్రాబాద్ నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటన

357
Ktr Padma Rao Goud
- Advertisement -

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు  సికింద్రబాద్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని  సీతాఫల్ మండి లోని జీహెచ్ఎంసీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లో టీఆర్ఎస్ కార్యకర్తలతో మాట్లాడనున్నారు.

ఈ పర్యటనలో భాగంగా మధ్యాహ్నం 12గంటలకు సికింద్రబాద్ నియోజక వర్గ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు , పార్టీ బలోపేతంపై చర్చించనున్నారు. ఈకార్యక్రమానికి కేటీఆర్ తో పాటు గ్రేటర్ హైదరాబాద్  మేయర్ బొంతు రామ్మోహన్, మంత్రి శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావుతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు హాజరుకానున్నారు.

- Advertisement -