గల్ఫ్‌ భాదితులను ఆదుకున్న కేటీఆర్‌..

296
KTR
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర సమితి కార్వ నిర్వాహక అధ్యక్షులు కె టి రామారావు చొరవతో 39 మంది తెలంగాణ కార్మికులు ఈ రోజు సౌదీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. కరీంనగర్, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన సుమారు 60 మంది కార్మికులు గత ఏడాది సౌదీలో నిర్మాణరంగ సంస్థలో పని కోసం వెళ్లారు.

అయితే గత ఆరు నెలలుగా వారికి ఎలాంటి వేతనాలు ఇవ్వకుండా కంపెనీ పని చేయించుకోవడంతో పాటు సరైన, ఆహారాన్ని కూడా సంస్థ అందించలేకపోయింది. తిండికి, ఉపాధికి అనేక కష్టాలు పడుతున్న వీళ్లు, తమ సమస్యను ట్విట్టర్ ద్వారా తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్‌కి తెలియజేయడం జరిగింది.

Gulf victims

కార్మికుల సమస్యలపైన వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర సియస్ ఎస్‌కే జోషిని కేటీఆర్ కోరారు. దీంతోపాటు సౌదీలోని భారత రాయబార కార్యాలయం అధికారులకు కూడా కేటీఆర్ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. సౌదీలోని భారత రాయబార కార్యాలయం స్పందించి, కార్మికుల సమాచారం ఆధారంగా వారిని గుర్తించి తెలంగాణకి పంపించేందుకు ఏర్పాట్లు చేసింది. తమ వద్ద ఉన్న వర్క్ పర్మిట్ వీసా గడువు పూర్తవడంతో భారత రాయబార కార్యాలయం వారికి తాత్కాలిక ఎగ్జిట్ విసాలను ఇవ్వడం జరిగింది.

వీరందరికీ విమాన టికెట్లను సమకూర్చి తెలంగాణకి పంపించడం జరిగింది. సౌదీ నుంచి తెలంగాణ కార్మికులు స్వరాష్ట్రానికి చేరుకోవడం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. సౌదీలోని భారత రాయభార కార్యాలయంతోపాటు, తెలంగాణ ఎన్నారై శాఖాధికారులకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎన్నారై శాఖ అధికారి చిట్టిబాబు కార్మికులను తెలంగాణ విమానాశ్రయంలో రిసీవ్ చేసుకుని వారిని స్వస్థలాలకు పంపించే ఏర్పాటు చేశారు.

- Advertisement -