నూతన జెడ్పీ చైర్మన్ లకు శుభాకాంక్షాలుః కేటీఆర్

343
ktr
- Advertisement -

నూతనంగా ఎన్నికైన జిల్లా పరిషత్ చైర్మన్లకు శుభాకాంక్షాలు తెలిపారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గతంలో ఎన్నడూ లేని విధంగా 32జెడ్పీ చైర్మన్ పదవులను ఏకగ్రీవంగా కైవసం చేసకున్నామని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ బలపర్చిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్ధులకు ఓట్ల వేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన విధంగా గెలిచిన అభ్యర్దులు ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలన్నారు.

ప్రజాప్రతినిధులు పార్టీలు మారడం అనే సంస్కృతిని ప్రొత్సహించింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. 2004 లో కాంగ్రెస్ పార్టీ తో కలిసి టీఆర్ఎస్ పోటీ చేసి గెలిస్తే , 10 మంది మా పార్టీ శాసన సభ్యులను కాంగ్రెస్ లో కలుపుకున్న మాట వాస్తవం కాదా అని చెప్పారు. ..రాజ్యాంగ బద్ధంగానే విలీనం జరిగినట్లు స్పీకర్ ప్రకటించారన్నారుకానీ కాంగ్రేస్ పార్టీ నేతలు ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేసిన తీరు ను ప్రజలు గమనిస్తున్నారన్నారు.

- Advertisement -