రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ సంబరాలు..

635
- Advertisement -

హుజూర్‌నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి సైది రెడ్డి భారీ మెజారిటి గెలుపొందడంతో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, టీఆరెస్ పార్టీ శ్రేణులు టపాసులు కాల్చి. సంబరాలు జరుపుకున్నారు. అలాగే ఎమ్మెల్యే అభ్యర్ధి సైది రెడ్డి భారీ మెజారిటితో గెలుపొందడంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అంబెడ్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్ పార్టీ నాయకలు, కార్యకర్తలు టపాసులు పేల్చి, స్వీట్లు తినిపించుకుని సంబురాలు జరుపుకున్నారు.

trs

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం సకినా పూర్‌లో టీఆర్‌ఎస్‌ గెలుపు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి , రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ చైర్మన్ లోక భూమారెడ్డి ఆధ్వర్యంలో గుస్సాడి నృత్యాలతో గిరిజనులు సంబరాలు చేసుకున్నారు. ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉన్నారన్న దానికి హుజూర్‌నగర్ గెలుపే నిలువెత్తు నిదర్శనమని రాష్ట్ర పాడి పరిశ్రమ వృద్ధి సంస్థ చైర్మన్ లోక భూమారెడ్డి అన్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి గెలుపు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా వ్యాప్తంగా టిఆర్ఎస్ నేతల సంబరాలు. ఆదిలాబాద్‌ పట్టణంలోని శాంతినగర్‌లో ఎమ్మెల్యే జోగు రామన్న ఇంటి వద్ద టిఆర్ఎస్ నేతల సంబరాల్లో మునిగితేలుతున్నారు.. టపాకాయలు పేల్చి అందరికి మిఠాయిలు పంచి పెట్టారు టీఆర్ఎస్ నేతలు.

TRS-workers

ఇక సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో హుజూర్‌నగర్‌లో టిఆర్ఎస్ అభ్యర్థి గెలుపు సందర్భంగా పటాకులు కాల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు టిఆర్ఎస్ నాయకులు. నిర్మల్లో కుంటలలో ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి అధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ శ్రేణుల సంబరాలు జరుపుకున్నారు. ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి టపాకాయలు కాల్చి ,స్వీట్లు పంచిపెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు.

- Advertisement -