టీఆర్ఎస్ మళ్లీ గెలవాలి:మోహన్ బాబు

258
mohan babu
- Advertisement -

తెలంగాణలో టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు సినీనటుడు మోహన్ బాబు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి పుట్టినరోజు సందర్భంగా పిల్మ్ నగర్‌ దైవ సన్నిధానంలో ఆలయ అర్చకులు,సిబ్బందికి వస్త్రదానం చేశారు.

ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావును తమ్ముడూ అంటూ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న మోహన్ బాబు మళ్లీ మీరే గెలవాలని కోరుకుంటున్నా అంటూ తుమ్మలతో చెప్పారు. ఈ కార్యకమంలో ఆలయ కమిటీ సభ్యులు పరుచూరి గోపాలకృష్ణ, శ్యామలాదేవి తదితరులు పాల్గొన్నారు.

mohan babu manchu

గతంలో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా కేసీఆర్‌పై మోహన్ బాబు ప్రశంసలు గుప్పించిన సంగతి తెలిసిందే. తెలుగును విశ్వవ్యాప్తం చేసేందుకు సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి అభినందనీయమని ..సీఎం కేసీఆర్ గొప్ప పోరాట యోధుడు అని..ఆయన గురించి ఎక్కువ చెప్పుకున్నా తక్కువేనని అభినందనలు తెలిపారు.

- Advertisement -