నిరుద్యోగంపై టీఆర్ఎస్ వాకౌట్…

57
nama
- Advertisement -

ఉద్యోగాల కల్పనలో కేంద్రానికి చిత్తశుద్దిలేదన్నారు ఎంపీ నామా నాగేశ్వరరావు. నిరుద్యోగ సమస్యపై లోక్ సభ నుండి వాకౌట్ చేశారు టీఆర్ఎస్ ఎంపీలు. అనంతరం మాట్లాడిన ఎంపీ నామా…యువతను మోసంచేసేందుకే రెండు కోట్ల ఉద్యోగాలంటూ ప్రకటించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రలో ప్రస్తుతం 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. విపరీతమైన నిరుద్యోగంతో ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ సర్కార్‌ ప్రకటించిందని, ఎనిమిదేండ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో వెల్లడించాలన్నారు.

ఉద్యోగాల కల్పనపై కేంద్ర ప్రభుత్వం మాట్లాడటం లేదని…. దేశంలో నిరుద్యోగ యువతకి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రధాని మోదీ గతంలో ఇచ్చిన హామీని అమలు పరచాలని డిమాండ్ చేశారు.

- Advertisement -