హైదరాబాద్ తర్వాత శరవేగంగా వరంగల్ అభివృద్ధి: వినోద్

156
vinod
- Advertisement -

ముంబై తర్వాత పుణెలా…హైదరాబాద్ తర్వాత వరంగల్ అభివృద్ధి చెందనుందన్నారు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్. గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటి చేస్తున్న 18 మందికి మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతితో కలిసి బీఫాం అందజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన వినోద్ కుమార్… గ్రేటర్‌ వరంగల్‌ నగరంపై అవగాహన లేకుండా ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని ఆరోపించారు. పార్టీలో పోటీ చాలా తీవ్రంగా ఉందని, ఉద్యమంలో చాలా మంది పని చేశారన్నారు. డీ లిమిటేషన్‌తో రిజర్వేషన్లు మారడంతో చాలా ఇబ్బందులెదురవుతున్నాయన్నారు.

వరంగల్‌ నగర అభివృద్ధిపై తమకు స్పష్టత ఉందని…. వరంగల్‌కు రింగ్‌ రోడ్డు వచ్చిందని, మంచినీటి పథకాలు, డ్రైనేజీ, పార్కులు అభివృద్ధి చేస్తున్నామన్నారు. తెలంగాణలో పట్టణీకరణ గొప్పగా జరుగుతోందన్నారు. ఇందులో కొన్నింటిని ప్రధాన నగరాలుగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు.

- Advertisement -