కాళోజీ కళాక్షేత్రాన్ని పరిశీలించిన వినోద్ కుమార్..

133
vinod kumar
- Advertisement -

వరంగల్ కాళోజీ కళాక్షేత్రాన్ని పరిశీలించారు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్. ప్రభుత్వ చీఫ్ విప్‌ దాస్యం వినయ్ భాస్కర్‌తో కలిసి కాళోజీ కళాక్షేత్రాన్ని పరిశీలించారు.

పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిధులకు కొదువ లేదు. పనులు పకడ్బందీగా చేపట్టాలన్నారు. సంవత్సరంలో పనులు చేయాలని, నాణ్యతలో తేడాలొస్తే సహించే ప్రసక్తే లేదన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -