టీఆర్ఎస్ కార్పొరేటర్లతో మంత్రి కేటీఆర్ భేటీ..

138
ktr
- Advertisement -

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ మేయర్,డిప్యూటీ మేయర్ పదవులను దక్కించుకోనుండగా ఇవాళ పార్టీ కార్పొరేటర్లతో సమావేశం కానున్నారు మంత్రి కేటీఆర్.

మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో జరిగే ఈ సమావేశానికి గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించారు. ఈ భేటీలో గ్రేటర్ ఫలితాలపై సమీక్ష నిర్వహించే అవకాశం ఉండగా… పొత్తులపై కూడా ఓ నిర్ణయానికి వస్తారా? అనే చర్చ సాగుతోంది..

ప్రస్తుత పాలకవర్గం గడువు ఇంకా రెండు నెలలు ఉండటంతో ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనే దానిపై చర్చించనున్నారు.

- Advertisement -