T’RS’ అభ్య‌ర్థులకు బీ ఫారాల‌ను అందజేసీన కేసీఆర్‌..

76
TRS Rajya Sabha Candidates
- Advertisement -

బుధ‌వారం సాయంత్రం ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను టీఆర్ఎస్ రాజ్య‌స‌భ అభ్య‌ర్థులు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో క‌లిశారు. టీఆర్ఎస్ అభ్య‌ర్థులుగా న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక ఎండీ దీవ‌కొండ దామోద‌ర్ రావు, హెటిరో అధిప‌తి డాక్ట‌ర్ బండి పార్థ‌సార‌థి రెడ్డి, గాయ‌త్రి గ్రానైట్ సంస్థ అధిప‌తి వద్దిరాజు ర‌విచంద్ర‌(గాయ‌త్రి ర‌వి) పేర్ల‌ను కేసీఆర్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా కేసీఆర్‌కు వీరు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అనంత‌రం ఈ ముగ్గురికి సీఎం కేసీఆర్ బీ ఫారాల‌ను అంద‌జేశారు.

- Advertisement -