ధాన్యం కొనుగోళ్లు.. జాతీయ ర‌హ‌దారుల‌పై రాస్తారోకో

37
trs
- Advertisement -

యాసంగిలో పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రంపై టీఆర్ఎస్ యుద్ధాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ జాతీయ రహదారులపై రాస్తారోకోకు టీఆర్ఎస్ పిలుపునివ్వగా పెద్ద ఎత్తన పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి.

నాగ‌పూర్‌, ముంబై, బెంగ‌ళూరు, విజ‌య‌వాడ జాతీయ రహ‌దా‌రు‌లపై నిర‌సన తెలిపారు. ముంబై జాతీయ రహదారిపై ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మహ‌బూ‌బ్‌‌న‌గర్‌ జిల్లాలో మంత్రులు నిరం‌జ‌న్‌‌రెడ్డి, శ్రీని‌వా‌స్‌‌గౌడ్‌, సూర్యా‌పేట జిల్లాలో జగ‌దీ‌శ్‌‌రెడ్డి, జన‌గామ జిల్లాలో ఎర్ర‌బెల్లి దయా‌క‌ర్‌‌రావు, నిర్మల్‌ జిల్లా కడ్తాల్‌ జంక్షన్‌ వద్ద ఇంద్ర‌క‌ర‌ణ్‌‌రెడ్డి నిరసనలకు దిగారు. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల‌తో పాటు కార్య‌క‌ర్త‌లు ధ‌ర్నాల‌కు దిగారు.

- Advertisement -