కేసీఆరే మళ్లీ రావాలి…ప్రత్యేక పూజలు,పాదయాత్ర

215
- Advertisement -

తెలంగాణ అభివృద్ధి ప్రధాత,గులాబీ దళపతి కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ప్రజలంతా భావిస్తున్నారు. ఎన్నికల తర్వాత కేసీఆరే మళ్లీ రావాలి అంటూ పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు టీఆర్ఎస్ కార్యకర్తలు.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన కార్పొరేటర్లు కొలుకుల జగన్, మంత్రి సత్యనారాయణ ఆధ్వర్యంలో సుమారు 50మంది టీఆర్‌ఎస్ కార్యకర్తలు మహాశైవక్షేత్రమైన శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి పాదయాత్రగా తరలివెళ్లారు. ఈ పాదయాత్రను జెండా ఊపి ప్రారంభించారు మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు.ప్రజలు టీఆర్‌ఎస్ వైపే మొగ్గు చూపారని, మరోసారి కేసీఆర్ సీఎం కావడం ఖాయమని వారు స్పష్టం చేశారు.

kcr

రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని జియాగూడ డివిజన్ కార్పొరేటర్ మిత్రకృష్ణ తెలిపారు. సంజయ్‌నగర్ నల్లపోచమ్మ-తుల్జాభవానీ దేవాలయంలో కార్పొరేటర్ మిత్రకృష్ణ టీఆర్‌ఎస్ శ్రేణులతో కలిసి కేసీఆర్ గెలుపు కోసం ప్రత్యేక హోమం, యాగం, గోమాత పూజ, దేవత విగ్రహాలకు పూజలు నిర్వహించారు.

- Advertisement -