టీఆర్ఎస్ ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్ధేశం..

57
- Advertisement -

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఈరోజు మధ్యాహ్నం 1 గంటలకు ప్రగతి భవన్‌లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న సందర్భంగా.. లోక్ సభ, రాజ్య సభల్లో టీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన పలు అంశాలు, కేంద్రం నుంచి సాధించాల్సిన పెండింగ్ సమస్యలపై ఎంపీలకు నివేదికలు అందజేస్తారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్ర హక్కులను సాధించుకునేందుకు ఉభయ సభల్లో టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, కేంద్రంపై అనుసరించాల్సిన పోరాట పంథాపై సీఎం కేసిఆర్ ఎంపీలకు దిశానిర్ధేశం చేయనున్నారు.

- Advertisement -