మంత్రి తలసానిని కలిసిన టీఆర్ఎస్‌ ఎన్నారైలు..

65
nri trs
- Advertisement -

తన వ్యక్తిగత పర్యటన కోసం లండన్ వచ్చిన తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను ఎన్నారై టీఆర్‌ఎస్‌ యూకే ముఖ్య నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా వారితో మంత్రి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎన్నారై టీఆర్ఎస్‌ యూకే దాదాపు 12 సంవత్సరాలుగా లండన్ గడ్డపై చేస్తున్న కార్యక్రమాల గురించి మంత్రికి ఎన్నారై టీఆర్ఎస్‌ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి వివరించారు, ముఖ్యంగా ఎమ్మెల్యే ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో అటు తలసాని శ్రీనివాస్, తలసాని సాయి ని గెలుపు కోసం ఎన్నారై తెరాస క్షేత్రస్థాయిలో ప్రచారం చేసిన విషయాలని గుర్తు చేశారు.

మంత్రి తలసాని మాట్లాడుతూ.. దశాబ్ద కాలంగా యూకేలో అటు తెలంగాణ సాంస్కృతిక సామాజిక సేవ కార్యక్రమాలే కాక కేసీఆర్‌ నాయకత్వాన్ని ఖండాంతరాల్లో బలపరుస్తూ టీఆర్ఎస్‌ పార్టీకి ఎంతో సేవ చేస్తున్నారని, మీ స్ఫూర్తి చాలా గొప్పదని అశోక్, రత్నాకర్ బృందాన్ని అభినందించారు.సోషల్ మీడియా వేదికగా ఎన్నారై టీఆర్ఎస్‌ యూకే చేస్తున్న సేవ పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని, త్వరలో మళ్ళీ యూకేకి వస్తానని అప్పుడు ఎన్నారై టీఆర్ఎస్‌ ఆధ్వర్యంలో గొప్ప ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుందామని మంత్రి తెలిపారు .

ఈ పర్యటనలో ఉన్న తలసాని సాయిని కూడా టీఆర్ఎస్‌ తెరాస నాయకులు కలిశారు. ఈ సమావేశంలో అశోక్ గౌడ్ దుసారి, రత్నాకర్ కడుదుల, హరిగౌడ్ నవాపేట్, మల్లారెడ్డి బీరం, సతీష్ బండ, మట్టారెడ్డి, నవీన్ భువనగిరి, అబు జాఫ్, సేరు సంజయ్, మదు, గణేష్ కుప్పలా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -