ప్రధానిని కలిసిన టీఆర్ఎస్ ఎంపీలు..

214
- Advertisement -

టీఆర్ఎస్ పార్టీకి చెందిన‌ లోక్‌స‌భ‌, రాజ్యసభ ఎంపీలు సోమవారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. దేశ రాజధానిలో టీఆర్ఎస్‌ కార్యాలయానికి భూ కేటాయింపుపై చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీ జితేంద‌ర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాజ్యసభ, లోక్‌స‌భ‌ టీఆర్ఎస్‌ ఎంపీల సంఖ్య 17గా ఉందని తెలిపారు. అర్బన్ డెవలప్‌మెంట్ గైడ్‌లైన్స్ ప్రకారం 1000 చదరపు గజాల స్థలం ఇవ్వాలని వివరించారు. రాజేంద్రప్రసాద్ రోడ్డులో ఖాళీగా ఉన్న స్థలాన్ని టీఆర్ఎస్‌ పార్టీకి కేటాయించాలని ప్ర‌ధానిని కోరినట్లు ఎంపీ జితేంద‌ర్‌రెడ్డి పేర్కొన్నారు.

TRS MPs

- Advertisement -